News February 2, 2025

వికారాబాద్ జిల్లా సీపీఎస్ సంఘం నూతన కార్యవర్గం

image

వికారాబాద్ జిల్లా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం వికారాబాద్లో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రాజకుమార్, ప్రధాన కార్యదర్శి ఇల్లూరి క్రాంతికుమార్, ఉపాధ్యక్షులుగా నరసింహ రాజు, అసోసియేషన్ ప్రెసిడెంట్గా సుందర్, సంయుక్త కార్యదర్శిగా రవీందర్, కార్యదర్శిగా శ్రీనివాస్, ఈసి మెంబర్స్‌గా అనిల్, తిరుపతి, రాజారత్నంలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ తెలిపారు.

Similar News

News January 17, 2026

ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

image

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్‌ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.

News January 17, 2026

నిర్మల్: ప్రతిపాదనలన్నింటికీ సీఎం ‘ఓకే’

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి భాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కోరిన పలు అభివృద్ధి పనులకు సానుకూలంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తులపై సైతం సీఎం సానుకూలత వ్యక్తం చేస్తూ నిధులు మంజూరు చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని సీఎం ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News January 17, 2026

గోరంట్ల మాధవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

image

అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ నమోదైన కేసులో మాజీ MP గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారెంట్‌ జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.