News February 2, 2025
వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ నజరానా

అండర్-19 ఉమెన్స్ టీ20 టీమ్కు బీసీసీఐ రూ.5 కోట్ల బహుమతిని ప్రకటించింది. ఈ నగదును జట్టుతో పాటు స్టాఫ్కు అందించనున్నట్లు తెలిపింది. ఈరోజు జరిగిన అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 82 పరుగులకే ఆలౌట్ అవగా, భారత్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ గెలుచుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును మన తెలుగమ్మాయి గొంగడి త్రిష గెలుచుకున్నారు.
Similar News
News April 1, 2026
కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈస్ట్ యూరప్లోని క్రిమియాలో ఓ కొండను ఫ్లైట్ ఢీకొట్టిన ఘటనలో 29 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2026
అకౌంట్లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!

కేరళంలోని ఎట్టుమనూర్లో ఆశ్నా థంపి అనే 26ఏళ్ల జర్నలిస్ట్ ఎన్నికల బరిలోకి దిగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తనకు ఆస్తులేం లేవని.. ₹40 క్యాష్, బ్యాంక్ అకౌంట్లో ₹44 ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొనడమే ఇందుకు కారణం. SUCI(C) పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె కేరళం ఎన్నికల బరిలో ఉన్న అత్యంత పేద అభ్యర్థిగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని ఆశ్నా చెబుతున్నారు. <<-se>>#Elections2026<<>>
News April 1, 2026
‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చిందంటే?

ఏటా ఏప్రిల్ 1న ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఫూల్స్ చేయడం చూస్తుంటాం. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన రూమర్ ఉంది. 1582లో ఫ్రాన్స్ తన క్యాలెండర్ను మార్చినప్పుడు కొత్త సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుందని ప్రకటించింది. అయితే ఈ మార్పు తెలియక APR 1నే వేడుకలు చేసుకున్న వారిని అందరూ ‘ఫూల్స్’ అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఈ ఏప్రిల్ ఫూల్ ప్రారంభమైందట. ఏదో ఒక సమయంలో మీరూ ఏప్రిల్ ఫూల్ అయ్యే ఉంటారు కదూ. COMMENT


