News February 3, 2025

వికారాబాద్: కరాటేతో మానసిక స్థైర్యం పెరుగుతుంది: స్పీకర్

image

కరాటేతో మానసిక స్థైర్యంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్ హాల్‌లో ఆరో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా గెలుపొందిన కరాటే క్రీడాకారులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ బహుమతులను ప్రదానం చేశారు. చిన్నతనం నుంచి కరాటే శిక్షణ ఇస్తే వారు మానసిక ధైర్యంతో సంసిద్ధులు అవుతారన్నారు.

Similar News

News July 6, 2025

రేపు భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

News July 6, 2025

HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

image

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.

News July 6, 2025

సూళ్లూరుపేట: ఐటీయూ డైరెక్టర్‌ పదవికి నామినేషన్‌

image

ఇంటర్నేషనల్‌ టెలీ కమ్యూనికేషన్‌ యూనియన్‌ రేడియో రెగ్యులేషన్స్‌ బోర్డు డైరెక్టర్‌గా భారత అభ్యర్థిగా సూళ్లూరుపేటకు చెందిన రేవతి మన్నెపల్లిని కేంద్రం నామినేట్‌ చేసింది. ఇస్రో, బార్క్‌ వంటి సంస్థల్లో సేవలందించిన ఆమె ప్రస్తుతం జెనీవాలో సభ్యురాలిగా ఉన్నారు. రేవతి JNTUHలో బీటెక్‌ పూర్తిచేశారు. అనంతరం ఇస్రోకు చెందిన షార్‌ కేంద్రంలో ఇంజినీర్‌గా పనిచేశారు. ASLV, PSLV రాకెట్ ప్రయోగాల్లో భాగస్వామ్యం అయ్యారు.