News February 3, 2025
కోట్ పల్లి: పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

పార్టీ పటిష్టతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంతోష రాజు ఎంపిక కావడంతో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి నియామక పత్రాన్ని వారికి అందజేశారు. మహిళలను భాగస్వామ్యం చేస్తూ పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
News March 22, 2026
విజయవాడ: గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీను బదిలీ

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుణదల సీఐగా ఉన్న వాసిరెడ్డి శ్రీను బదిలీ కాగా, ఆయన స్థానంలో సత్య రమేష్ను నియమించారు. అలాగే అజిత్ సింగ్ నగర్ సీఐగా చంద్రశేఖర్ నియామకమయ్యారు. అక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వర నాయక్ను సీసీఎస్కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
News March 22, 2026
NLG: నాడు ఫ్లోరైడ్ కన్నీళ్లు.. నేడు కృష్ణా జలాలు..!

దశాబ్దాల పాటు ఫ్లోరైడ్ రక్కసితో తల్లడిల్లిన నల్గొండ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామాగా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత కృష్ణా జలాలు అందుతుండటంతో ఈ మహమ్మారి పూర్తిగా అంతమైంది. జిల్లాలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం సైతం పార్లమెంటులో ధ్రువీకరించింది. ఒకప్పుడు కలుషిత నీటితో అల్లాడిన ఆ నేల నేడు పచ్చని మాగాణిగా రూపుదిద్దుకుంది. నేడు ప్రపంచ జల దినోత్సవం.


