News February 3, 2025

SKLM: రేపు మధ్యాహ్నం వరకు డోనర్ పాసులు పంపిణీ

image

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి విరాళాలు సమర్పించిన దాతలకు రథసప్తమి రోజున దర్శనానికి డోనర్ పాసులతో అవకాశం కల్పించామని ఈవో భద్రాజి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదరు డోనార్ పాస్‌లు ఇచ్చే ప్రక్రియ రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆలయానికి విరాళం ఇచ్చిన దాతలు గమనించాలని కోరారు.

Similar News

News February 3, 2025

SKLM: 5 వరకు హెలికాప్టర్ రైడ్ పొడిగింపు

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తులను ఆకట్టుకోవడానికి హెలికాప్టర్ రైడ్ ప్రకటించారు. భక్తుల నుంచి వస్తున్న స్పందన, డిమాండ్ మేరకు ఈ రైడ్‌ను ఈనెల 5వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు డ్వామా పీడీ బి.సుధాకర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News February 3, 2025

అర్ధరాత్రి నుంచి ఆదిత్యుని క్షీరాభిషేకం

image

ప్రసిద్ధ సూర్య నారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అరసవల్లిలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదిత్యునికి క్షీరాభిషేకం చేస్తామని ఈవో వై.భద్ర తెలిపారు. అనంతరం ప్రత్యక దర్శనాలు కల్పిస్తారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజ రూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

News February 3, 2025

పెళ్లికి ఒప్పుకోలేదనే యువతిపై దాడి: ఎస్పీ

image

శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజీలో ఓ విద్యార్థినిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సారవకోటకు చెందిన జగదీశ్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ‘విజయనగరం(D) సంతకవిటికి చెందిన యువతి డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉంటోంది. గతంలో జగదీశ్‌తో ఆమెకు పరిచయం ఉంది. గతనెల 30న ఆమెను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అతను దాడి చేసి గాయపరిచాడు’ అని ఎస్పీ చెప్పారు.