News March 19, 2024

శ్రీకాకుళం: పది పరీక్షలకు 458 గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మొత్తం 29,243 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,785 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 458 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Similar News

News July 3, 2024

శ్రీకాకుళంలో 3రోజులు వర్షాలు

image

ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రానున్న 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రేపు మబ్బులతో కూడి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News July 3, 2024

శ్రీకాకుళం: జాతీయస్థాయి అవార్డులకు ఆహ్వానం

image

జాతీయస్థాయి ఉపాధ్యాయుల అవార్డ్స్-2024 సంబంధించి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఇందులో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు ఈనెల 15వ తేదీలోగా http://nationalawardstoteacherseducation.gov.in వెబ్‌సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు.

News July 3, 2024

పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం జిల్లా టాప్

image

పింఛను పంపిణీ లబ్ధిదారుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 3,19,147 ఉండగా ఇప్పటి వరకు 99.21% లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. దీని తర్వాత విజయనగరం రెండో స్థానంలో ఉంది. కాగా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 3,16,528 మందికి పెన్షన్ పంపిణీ చేశారని అధికారులు తెలిపారు.