News February 3, 2025
15న పార్లమెంటులో ‘రామాయణం’ ప్రదర్శన

‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ యానిమేటెడ్ చిత్రాన్ని ఈ నెల 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నట్లు గీక్ పిక్చర్స్ వెల్లడించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపింది. 1993లో ఈ సినిమాను ఇండో-జపనీస్ టీమ్ తెరకెక్కించింది. 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. రచయిత విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి రైటర్గా పనిచేశారు.
Similar News
News April 3, 2026
రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల పునర్విభజన

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజనకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ జరిగింది. ఈ మార్పులతో వార్డుల సంఖ్య విశాఖలో 98 నుంచి 120కి, విజయవాడలో 64 నుంచి 86కు, గుంటూరులో 57 నుంచి 76కు, నెల్లూరులో 54 నుంచి 72కి, కర్నూల్లో 52 నుంచి 68కి, తిరుపతిలో 50 నుంచి 66కు, అనంతపురంలో 50 నుంచి 62కు పెరిగాయి.
News April 3, 2026
1,89,819 అక్షరాలతో పదం ఉందని తెలుసా?

Pneumonoultramicroscopicsilicovolcanoconiosis (45 అక్షరాలు) అనేది ఇంగ్లిష్లో అత్యంత పొడవైన పదం. అగ్నిపర్వత ధూళి వల్ల వచ్చే వ్యాధి ఇది. అయితే టిన్టిన్ అనే ప్రొటీన్ కెమికల్ నేమ్ ఏకంగా 1,89,819 అక్షరాలు ఉంది. Methionylthreonyl.. అంటూ సాగే దీనిని పలకడానికే 2-3hrs పడుతుంది. ఇది 34,350 రకాల ఆమ్లాల గురించి వివరిస్తుంది. దీనిని పదంగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో డిక్షనరీల్లో చోటు దక్కలేదు.
News April 3, 2026
₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

రాజా రవివర్మ పెయింటింగ్స్లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.


