News February 3, 2025
త్వరలోనే గజ్వేల్లో కేసీఆర్ భారీ సభ!
TG: ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన మాజీ సీఎం KCR త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై గజ్వేల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు యోచిస్తున్నారు. అనువైన స్థలం కోసం పార్టీ శ్రేణులు వెతుకుతున్నట్లు సమాచారం. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, నేతన్నలు, అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని తెలుస్తోంది.
Similar News
News February 3, 2025
ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు
AP: నెల్లూరు డిప్యూటీ మేయర్గా TDP అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. ఆమెకు 41 ఓట్లు, YCP అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు పడ్డాయి. ఏలూరు డిప్యూటీ మేయర్లుగా TDP అభ్యర్థులు దుర్గాభవానీ, ఉమా మహేశ్వరరావు ఎన్నికయ్యారు. రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో వారు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తిరుపతిలో YCP కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ MP గురుమూర్తి, MLC సుబ్రహ్మణ్యం నిరసనకు దిగారు.
News February 3, 2025
67వ గ్రామీ అవార్డ్స్-2025 విజేతలు వీరే
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్- కౌబాయ్ కార్టర్(బియాన్స్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్ – ‘నాట్ లైక్ అస్’ (కేండ్రిక్ లామర్)
బెస్ట్ కంట్రీ ఆల్బమ్- ‘కౌ బాయ్ కార్టర్ (బియాన్స్)
బెస్ట్ అమెరికానా పర్ఫార్మెన్స్ – ‘అమెరికన్ డ్రీమింగ్’ (సియెర్రా ఫెర్రెల్)
బెస్ట్ మెలోడిక్ రాప్ పర్ఫార్మెన్స్ – ‘3’ (రాప్సొడీ ఫీచరింగ్ ఎరికా బాడు)
బెస్ట్ రాక్ ఆల్బమ్ – హాక్నీ డైమండ్స్ (ది రోలింగ్ స్టోన్స్)
News February 3, 2025
సుప్రీంకోర్టులో KTR పిటిషన్.. 10న విచారణ
TG: పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని వెల్లడించింది.