News February 3, 2025

వేములవాడ: నేడు అఘోరి వస్తుందా..? రాదా..?

image

గతంలో అఘోరి చేసిన వ్యాఖ్యలతో నేడు ఏం జరగనుందో అని అంతటా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి ఫిబ్రవరి 3న వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వేములవాడ వైపు మళ్లింది. అఘోరి చెప్పినట్లుగా నేడు నిజంగా ఆమె వేములవాడకు వస్తుందా..? రాదా..? అనేది  మరికొద్దిసేపట్లో తెలవనుంది.

Similar News

News April 9, 2026

పెద్దపల్లి: ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొన్నారు. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించి, తేమ వచ్చిన 24 గంటల్లోనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. చిన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

News April 9, 2026

ఖైరతాబాద్: సమతా కిచెన్ ప్రారంభించిన మంత్రి

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లో సమతా కిచెన్ ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై రిబ్బన్ కట్ చేశారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రాన్స్ జెండర్లకు ERS చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, HYD కలెక్టర్ దాసరి హరిచందన, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

News April 9, 2026

జగిత్యాల: తహశీల్దార్ల డిప్యూటేషన్ ఉత్తర్వులు

image

జగిత్యాల జిల్లాలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తహశీల్దార్లను డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. డి.నరేష్‌ను కొడిమ్యాల్ తహశీల్దార్‌గా, ఎం.కిరణ్ కుమార్‌ను మల్యాల ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా నియమించారు. మల్యాల తహశీల్దార్ కె.వసంతను జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో, డీఏఓగా నియమించారు. సంబంధిత అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని సూచించారు.