News February 3, 2025

అనకాపల్లి: మత్స్యకారులకు అందని భృతి

image

చేపల వేట నిషేధానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇప్పటివరకు అందలేదు. ప్రతి ఏటా మాదిరిగా గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. జిల్లాలో 27 మత్స్యకార గ్రామాల్లో 2,168 మంది మత్స్యకారులకు ప్రభుత్వం రూ.2.16 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిహారం చెల్లించడానికి అవకాశం లేకుండా పోయింది.

Similar News

News February 3, 2025

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి TDPదే

image

AP: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి, ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 23 ఓట్లు పడగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. దీంతో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

News February 3, 2025

పెద్దపల్లిలో MLC కవిత పర్యటన

image

పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత నేడు పర్యటిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష తెలిపారు. రంగాపూర్‌లో కార్మిక నాయకుడు కౌశిక్ హరి కూతురి వివాహానికి హాజరుకానున్నారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం 12:15కు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో నిర్వహించే టీబీజీకేఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారన్నారు.

News February 3, 2025

హిందూపురం మున్సిపల్‌ పీఠం టీడీపీ కైవసం

image

హిందూపురం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కుమార్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. ఎన్డీఏ కూటమికి ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 23 మంది బలం ఉండటంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఆరు నెలల క్రితం వైసీపీ ఛైర్‌పర్సన్ ఇంద్రజ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.