News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News March 13, 2026

‘జస్టిస్ ఘోష్ కమిషన్’పై APR 8న తీర్పు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై <<17939261>>జస్టిస్ ఘోష్<<>> కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావు, IAS స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సాక్షులుగా పిలిచి నిందితులుగా చేర్చారని వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.

News March 13, 2026

BSNLలో 120 పోస్టులు.. మార్చి 31 వరకు గడువు

image

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 7 వరకు ఆఖరు తేదీ కాగా.. మార్చి 31 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ ఏప్రిల్ 1 – 8వరకు చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. వెబ్‌సైట్: bsnl.co.in/

News March 13, 2026

ఏలూరు: చిన వెంకన్నకు ‘గ్యాస్’ సెగ

image

యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ప్రభావం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంపై పడింది. స్వామివారి అన్న ప్రసాదాలు, ప్రసాదాల తయారీకి రోజుకు 30 నుంచి 40 గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తారు. ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడటంతో దేవాలయ అధికారులు గ్యాస్ స్థానంలో కట్టెలను వాడేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో వై.భద్రాజీ తెలిపారు.