News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News January 21, 2026

PDPL: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

image

అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ దాసరి వేణు మంగళవారం సమీకృత కలెక్టరేట్లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి నరేష్ కుమార్, తహసీల్దార్ రాజ్ కుమార్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ సన ఫక్రుద్దీన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News January 21, 2026

TTD జేఈవోగా శరత్ నియామకం

image

TTD జేఈవో(హెల్త్ అండ్ ఎడ్యుకేషన్)గా డాక్టర్ ఏ.శరత్ నియామకమయ్యారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఆయన రిటైర్మెంట్ అయిన తరువాత ప్రభుత్వం రీ-ఎంప్లాయిమెంట్ కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

News January 21, 2026

ముంబైపై ఢిల్లీ ఘన విజయం

image

WPL: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51*), లీ(46) చెలరేగడంతో 155 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అమన్‌జోత్ కౌర్, వైష్ణవికి చెరో వికెట్ దక్కింది. ముంబై బ్యాటర్లలో బ్రంట్(65), హర్మన్ ప్రీత్(41) మాత్రమే రాణించారు.