News March 19, 2024
నేడు CWC సమావేశం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఢిల్లీలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో, రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలకు సంబంధించిన హామీలపై చర్చించే అవకాశం. ఇవాళ్టి భేటీలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది.
Similar News
News July 8, 2024
శ్రీలంక హెడ్ కోచ్గా సనత్ జయసూర్య
శ్రీలంక క్రికెట్ టీమ్కు తాత్కాలిక హెడ్ కోచ్గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. ఇప్పటినుంచి సెప్టెంబర్లో ఇంగ్లండ్ పర్యటన వరకూ ఆయన కోచ్గా కొనసాగుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఆయన ఆ జట్టుకు ఫుల్ టైమ్ క్రికెట్ కన్సల్టెంట్గా పనిచేశారు. శ్రీలంకకు 445 ODI, 110 టెస్టులు, 31 T20ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆయన మొత్తం 21,032 రన్స్ చేశారు. ఇందులో 42 సెంచరీలున్నాయి.
News July 8, 2024
కవిత పిటిషన్పై విచారణ వాయిదా
BRS MLC కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని CBIని ఆదేశించింది. కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్షీటులో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని CBI గతంలో చెప్పింది. ఇటీవల రీఫైలింగ్ చేసిన ఛార్జ్షీటులో కూడా తప్పులున్నట్లు కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సీబీఐకి కోర్టు నోటీసులిచ్చింది.
News July 8, 2024
మణిపుర్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపుర్లో పర్యటిస్తున్నారు. జిరిబామ్, చురాచాంద్పూర్ జిల్లాల్లోని రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అంతకుముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్న ఆయన, వారికి వెంటనే సహాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.