News February 3, 2025

అల్లూరి: కృష్ణా నదిని ఈదేశిన తండ్రీకూతురు

image

విజయవాడలో ఆదివారం నిర్వహించిన కృష్ణానది క్రాసింగ్ ఈత పోటీల్లో కూనవరం మండలం పల్లూరుకి తండ్రీ కూతురు సత్తా చాటారు. గ్రామానికి చెందిన ఆవుల సంతోష్ కుమార్ (35) అతని కుమార్తె ఆవుల శాన్వి(13) 1.5 కిలోమీటర్ల కృష్ణా నదిని విజయవంతంగా ఈదేశారు. తొలిసారి పోటీల్లో పాల్గొన్న శాన్వి 31.5 నిమిషాల్లో తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. సంతోష్ 36.45 నిమిషాల్లో క్రాస్ చేయగా.. అతను ఈ పోటీలో పాల్గొనడం ఇది మూడోసారి. 

Similar News

News November 9, 2025

డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

image

కాన్పు తర్వాత చాలా మంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్లలో మార్పులు, వెయిట్ పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులెత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

News November 9, 2025

అనంత: ఆడ, మగ మృతదేహాల కలకలం

image

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వచ్చే ఎగువ కాలువ(HLC)లో శనివారం సాయంత్రం 2 మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. బొమ్మనహాల్(M) నాగలాపురం HLC 116, 117 కిలోమీటర్ల వద్ద ఆడ, మగ మృతదేహాలను స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే బొమ్మనహాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి వయసు సుమారు 45 ఏళ్లు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News November 9, 2025

బాడీ షేమింగ్.. హీరోయిన్‌కు క్షమాపణలు

image

బాడీ షేమింగ్‌కు గురైన తమిళ హీరోయిన్ <<18220614>>గౌరీ<<>> కిషన్‌కు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణలు చెప్పారు. ఆమె బరువు గురించి మీడియా సమావేశంలో ప్రశ్న లేవనెత్తినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే తాను అడిగిన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.