News February 3, 2025

వరంగల్: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

image

యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సుబేదారి PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం(M) ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో గొడవపడి HNKలోని స్నేహితురాలి వద్ద ఉంటోంది. బాలసముద్రంలో ఎగ్జిబిషన్‌‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బస్టాండ్‌లో వదిలేశాడు. స్థానికులు యువతిని PSకి తరలించగా ఆటోడ్రైవర్ అత్యాచారం చేసినట్లు తెలిపింది.

Similar News

News March 3, 2026

VZM: ఇంట్లోవారిని బెదిరిద్దామని గడ్డిమందు తాగిన వ్యక్తి..

image

విజయనగరం (D) రేగిడి మండలం బూరాడకి చెందిన జగ్గునాయుడు కొంత కాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో వారిని బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం తాగిన మైకంలో ఇంటి సమీపంలో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న జగ్గునాయుడిని కుటుంబీకులు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

News March 3, 2026

పుత్తూరు : వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి

image

వడదెబ్బ కారణంగా వ్యక్తి మృతి చెందిన ఘటన పుత్తూరు పట్టణంలో జరిగింది. స్థానిక జెండామాను విధికి చెందిన పార్దిపన్ (45) కొన్ని రోజులుగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం చిత్తూరు నుంచి పుత్తూరుకు బస్సులో ప్రయాణించే సమయంలో పుత్తూరుకు రాగానే అస్వస్థతకు గురయ్యారు. 108 సిబ్బంది చేరుకొని చూడగా అప్పటికే మృతి చెందారు. అనారోగ్యంతో పాటు, ఎండ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

News March 3, 2026

జనగామ: పట్టిస్తే రూ.10 వేలు.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా!

image

జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్‌లో మద్యపాన నిషేధ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా, తాగిన వారిని, అమ్మినవారిని పట్టించిన వారికి రూ.10 వేలు నజరానా ప్రకటించి కఠినంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.