News February 3, 2025

మంచిర్యాల: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లు ఏర్పాటు చేయగా ప్రాక్టికల్ రాసే జనరల్ విద్యార్థులు 3,850 మంది, ఒకేషనల్ రాసే విద్యార్థులు 1936 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.

Similar News

News January 14, 2026

HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

image

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..

News January 14, 2026

భద్రాద్రి: పండుగ వేళ విషాదం.. బస్సు ఢీకొని మహిళ మృతి

image

చండ్రుగొండ మండల కేంద్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న ఓ మహిళను భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సంక్రాంతి సంబరాల్లో ఉండాల్సిన కుటుంబంలో ఈ ఘటనతో పెను విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2026

ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అంజలి శార్వాణి

image

ఆదోనికి చెందిన క్రికెటర్ అంజలి శార్వాణి ఆంధ్ర మహిళా సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నుంచి జరిగే వన్డే టోర్నీ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆమెను సారథిగా ప్రకటించింది. గతంలో భారత జట్టు తరఫున ఆడిన ఆమె, మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే సర్జరీ పూర్తి చేసుకున్న అంజలి, మైసూర్ సెలక్షన్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు.