News February 3, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు
∆} నేలకొండపల్లిలో భక్త రామదాసు జయంతి వేడుకలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

Similar News

News February 3, 2025

తల్లాడలో ఆకట్టుకుంటున్న ఫ్లెక్సీ 

image

రైతుకష్టపడితేనే.. అందరికీ పంచభక్ష్యం.. అని రాసివున్న రాజకీయ ఫ్లెక్సీ రైతులు, వాహనాదారులను ఆకట్టుకుంటోంది. తల్లాడ మండలం అంజనాపురం సమీపంలో రైతు నలజాల శ్రీనివాసరావు తన మొక్కజొన్న పంటలో రాజకీయ నాయకుల ఫోటోలతో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో రైతు కష్టం చెబుతూనే తన అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది.

News February 3, 2025

ఖమ్మం: స్వల్పంగా పెరిగిన కొత్త మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.14,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోలిస్తే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్ లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు.

News February 3, 2025

అందరి చూపు త్రిషపైనే..!

image

భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 309 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీశారు. ఇటీవల ఆసియా కప్ గెలవడంలోనూ ఈమె కీలక పాత్ర పోషించారు. దీంతో అందరి చూపు ఈ భద్రాచలం అమ్మాయిపైనే ఉంది. ఇలానే ఆడితే సినియర్ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.