News February 3, 2025

సూర్యాపేట: నీటి తొట్టలో పడి చిన్నారి మృతి

image

పాలకవీడు మండలం హనుమయ్య గూడెంలో ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బానోతు కృష్ణ, శిరీష దంపతులకు ఏడాదిన్నర పాప నవనీత ఉంది. కృష్ణ సీఆర్పీఎఫ్ జవాన్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. వారం క్రితం తల్లి శిరీష, కుమార్తె స్వగ్రామానికి వచ్చారు. తల్లి ఇంటి పనులు చేస్తుండగా పాప ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందింది.

Similar News

News July 4, 2025

అనకాపల్లి జిల్లాలో పార్కు నిర్మాణానికి ఆమోదం

image

విశాఖలో V.M.R.D.A. బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. పలు అభివృద్ధి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా కొత్తూరులో రూ.5 కోట్లతో సుమారు 5.68 ఎకరాల్లో పార్కు నిర్మించనున్నారు.‌ వేపగుంట-పినగాడి మధ్య 60 అడుగుల రోడ్డు నిర్మిస్తారు. మధురవాడ, మారికవలస, వేపగుంటలో <<16943032>>అపార్ట్మెంట్లు<<>> నిర్మించేందుకు అమోదం తెలిపారు. ఛైర్మన్ ప్రణవ గోపాల్, ఎంసీ విశ్వనాథన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.

News July 4, 2025

ఖమ్మం: తీవ్ర విషాదం.. ఇద్దరు యువకుల మృతి

image

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఘోర విషాదం నెలకొంది. చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో వాగులో ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2025

పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్.. ఏం చేయాలి?

image

HYDలో ‘కిలోమీటర్ దూరానికి గంట పట్టింది’ అని వే2న్యూస్‌లో పోస్ట్ అయిన <<16941177>>వార్తకు<<>> యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కరి ప్రయాణం కోసం కార్లను వాడటం ట్రాఫిక్‌కు ప్రధాన కారణమని అంటున్నారు. కంపెనీలన్నీ ఒకే చోట ఉన్నాయని, వాటిని వివిధ ప్రాంతాలకు తరలించాలని మరికొందరు సూచించారు. మెట్రో, ఆర్టీసీ లాంటి ప్రజారవాణాకు పెద్దపీట వేయాలంటున్నారు. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఏం చేయాలో కామెంట్ చేయండి.