News February 3, 2025
భువనగిరి: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఫిబ్రవరి ప్రారంభంలోనే ఎండలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రత జనవరి 31న 31.1 డిగ్రీలు నమోదు కాగా, అదివారం 35.8 డిగ్రీలకు చేరింది. మూడు రోజుల వ్యవధిలోనే 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ తీవ్రతకు ఉక్కపోత కూడా తోడవడంతో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీ, కూలర్ల వాడకం పెరుగుతోంది. దీని వల్ల విద్యుత్ వినియోగం అధికమైంది.
Similar News
News March 18, 2026
కామారెడ్డి: బీజేపీ నాయకులకు ప్రశిక్షణా తరగతులు

కామారెడ్డిలోని BJP కార్యాలయంలో మంగళవారం బాధ్యతలున్న నాయకులకు ప్రశిక్షణా తరగతులు నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా BJP ఇన్ఛార్జ్ విక్రంరెడ్డి హాజరై నాయకులకు పార్టీ సిద్ధాంతంపై, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై నాయకులకు అవగాహన కల్పించారు. BJP సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, పైడి ఎల్లారెడ్డి, అరుణ, నరేందర్ రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.
News March 18, 2026
MBNR: జన గణన.. దశలవారీగా ఇలా!

✒మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్లిస్టింగ్,హౌస్ ఎన్యూమరేషన్), గృహాల గణన, తెలంగాణ రాష్ట్రంలో ఈ దశ మే 11, 2026న ప్రారంభమై జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని,
✒రెండవ దశలో జన గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహించబడుతుందని,మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. జనగణనను విజయవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
News March 18, 2026
కాకతీయ విశ్వవిద్యాలయం LL.B పరీక్షల షెడ్యూల్ విడుదల

వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి LL.B(3YDC V సెమ్, 5YDC IX సెమ్) పరీక్షల టైమ్టేబుల్ను విడుదల చేసింది. పరీక్షలు మార్చి 24 నుంచి ఏప్రిల్ 2 వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెల్ఫోన్లు పరీక్ష కేంద్రాల్లో నిషేధమని అధికారులు తెలిపారు.


