News February 3, 2025
ఆత్మీయ భరోసా.. నిలిచిపోయిన డబ్బుల జమ?

TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.
Similar News
News April 3, 2026
నిడదవోలులో మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

ఏపీ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం నిడదవోలుకు వచ్చారు. ఆయనకు నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఆత్మీయంగా పలకరించారు. ముందుగా పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఒకే చోట జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు కలవడంతో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
News April 3, 2026
CBSE కొత్త కరిక్యులం.. 3 భాషలు చదవాల్సిందే

వచ్చే అకడమిక్ ఇయర్(2026-27) నుంచి అమలు చేసే పాఠ్య ప్రణాళికను CBSE రిలీజ్ చేసింది. ఆరో తరగతి నుంచి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా(3 భాషలు చదవడం)ను తప్పనిసరి చేసింది. ఇందులో 2 భారతీయ భాషలు ఉండాలి. ఇంగ్లిష్ను ఫారిన్ లాంగ్వేజ్గా పరిగణిస్తారు. అలాగే మాథ్స్, సైన్స్లో టూ లెవెల్ సిస్టమ్ రానుంది. ఇందులో భాగంగా 80మార్కుల కామన్ ఎగ్జామ్ రాయడం తప్పనిసరి. మరో 25Mకు అడ్వాన్స్డ్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆప్షనల్.
News April 3, 2026
LokPoll సర్వే.. కేరళంలో కాంగ్రెస్దే అధికారం!

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని UDFదే అధికారమని <<19539543>>LokPoll<<>> సర్వే అంచనా వేసింది. ఆ కూటమికి 42-44% ఓట్లు, 77-81 సీట్లు వస్తాయని తెలిపింది. సీఎం విజయన్ సారథ్యంలోని LDFకు 39-41% ఓట్లు, 58-62 సీట్లు రావొచ్చని వెల్లడించింది. NDA 14-16% ఓట్లు, 1-2 సీట్లతో మూడో స్థానానికి పరిమితమవ్వొచ్చని పేర్కొంది. కేరళంలో 140 స్థానాలకు ఈ నెల 9న పోలింగ్ జరగనుంది.
<<-se>>#ELECTIONS2026<<>>


