News March 19, 2024
పదో తరగతి పరీక్షలు..మొదటి రోజు 99.61% హాజరు

MBNR:పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం 12,738 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు 58 కేంద్రాలు ఏర్పాటు చేయగా గతంలో అనుత్తీర్ణులై మళ్లీ ఫీజు చెల్లించిన వారికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్ రవినాయక్-2,జిల్లాస్థాయిఅధికారులు-7,DEO రవీందర్-6,ప్లయింగ్ స్క్వాడ్స్ 24 కేంద్రాలను తనిఖీ చేశాయి.
Similar News
News December 4, 2025
MBNR: ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. వేటు..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. 3 విడుదల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కఠిన నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు సర్పంచ్, వార్డు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గోపాలమిత్రాలు, సీసీలు వంటి వర్గాలు ఏ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగం పోతుంది. జాగ్రత్త సుమా..!
News December 4, 2025
MBNR: స్థానిక సంస్థలు ఫేజ్-3 మొదటి రోజు 81 నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా పేజ్ 3 మొదటి రోజున 81 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మూడో విడుదల భాగంగా అడ్డాకుల మండలంలోని 17 గ్రామాల నుంచి ఆరు నామినేషన్లు, బాలానగర్ మండలంలోని 37 గ్రామాల నుంచి 22 నామినేషన్లు, భూత్పూర్ మండలంలోని 19 గ్రామాల నుంచి 17 నామినేషన్లు, జడ్చర్లలోని 45 గ్రామాల నుంచి 25 నామినేషన్లు, మూసాపేటలోని 15 గ్రామాల నుంచి 11 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News December 4, 2025
నవాబుపేట మండలంలోని అత్యధిక ఏకగ్రీవాలు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి విడతలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేట మండలంలో అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయి. మండలంలోని కాకర్జాల పల్లె గడ్డ, పుట్టోని పల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైన అధికారులు వెల్లడించారు. గండీడ్ మండలంలో అంచనపల్లి, మన్సూర్ పల్లి, మహమ్మదాబాద్ మండలంలోని ఆముదాల గడ్డ, రాజాపూర్ మండలంలోని మోత్కులకుంట తండా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.


