News February 3, 2025
మరికల్: చిరుత సంచారం నిజమే..!

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేష్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.
Similar News
News April 17, 2026
ప.గో: లంచావతారాలుగా మారారంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి, ఆయన అనుచరుడు తోట గోపిలు లంచావతారాలుగా మారారని అదే పార్టీకి చెందిన నాయకుడు రవికిరణ్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గోపి కుమారుడు రాజా లంచాల దందా సాగిస్తూ, వీరి దందాను అమరావతిలో కూడా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని, బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చేయడం తగదని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
News April 17, 2026
రహదారులపై వాహనాలు నిలిపితే కేసులు: VZM ఎస్పీ

జాతీయ రహదారులపై అనుమతి లేని ప్రదేశాల్లో వాహనాలు నిలిపితే కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామని ఎస్పీ దామోదర్ శుక్రవారం హెచ్చరించారు. దాబాలు, మలుపులు, వంతెనలు, జంక్షన్ల వద్ద వాహనాలు నిలిపివేయడం ప్రమాదాలకు దారి తీస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతించిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు ఆపాలని, హజార్డ్ లైట్లు ఆన్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News April 17, 2026
సంగారెడ్డి: ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 19న జరిగే ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. 6వ తరగతి కోసం 10 కేంద్రాల్లో 1,200 మంది, 7-10 తరగతుల కోసం 644 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6వ తరగతి పరీక్ష ఉదయం 10 నుండి 12 వరకు, మిగిలిన తరగతులకు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జరుగుతుందని వివరించారు.


