News February 3, 2025

మరికల్: చిరుత సంచారం నిజమే..!

image

NRPT జిల్లా మరికల్ మండలం పూసల్ పాడ్ లో సంజీవ కొండపై <<15345332>>చిరుత<<>> సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి మల్లేశ్ ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన కొండపై చిరుత సంచరించిన వీడియోలు ఉన్నాయని, గ్యాప్ తర్వాత పశువులపై దాడి చేసినట్టు ఆయన నిర్ధారించారు. చిరుత సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానికి ఎలాంటి హాని కలిగించొద్దని రైతులను హెచ్చరించారు. చిరుత సంచారంతో ప్రజల్లో భయందోళన కలుగుతుంది.

Similar News

News July 6, 2025

రేపటి నుంచి 8 గంటల ముందే..

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్‌లో కొత్త విధానం జులై 7 నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయల్దేరే రైళ్ల ఛార్టులను ముందురోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.

News July 6, 2025

31 మంది మందుబాబులకు జైలు శిక్ష: వరంగల్‌ CP

image

మద్యం తాగి వాహనం నడపిన 31 మందికి జైలు శిక్ష విధించినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా, పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు. అలాంటి ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డ సందర్భాలూ ఉన్నాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 6, 2025

నిరాశ పరిచిన జూన్.. రైతన్నను వెంటాడుతున్న కష్టాలు

image

నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయని.. మంచి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు సంతోషించారు. జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వ్యవసాయం మందగించిపోతుంది. వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మోస్తరు వర్షాలే తప్ప.. భారీ వర్షం జాడ కానరావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.