News February 3, 2025

కోదాడ స్కూల్ నుంచి స్టూడెంట్స్ పరార్.. పట్టుకున్న పోలీసులు

image

కోదాడ మం. నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పారిపోవడం ప్రభుత్వ యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఎస్సై అనిల్ రెడ్డి వివరాలు.. పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పారిపోగా ప్రిన్సిపల్ ఝాన్సీ PSలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కారణాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 18, 2026

విద్యుత్ ప్రమాదాలపై అంతర్జాలంలో ఫిర్యాదుకు అవకాశం

image

వేసవిలో ఎక్కడైనా విద్యుత్ ప్రమాదాలు తలెత్తితే వెంటనే TGNPDCL పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. నియంత్రికలు, తీగలు తెగిపోవడం, తదితర సమస్యలను వెబ్సైట్లోకి వెళ్లాక సెల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యాక సంబంధిత చిత్రాలతో పాటు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలన్నారు. ఈ ఫిర్యాదులను ప్రత్యేక విభాగం అధికారులు పరిశీలించి పరిష్కారం చూపిస్తారన్నారు.

News March 18, 2026

HNK: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల చార్జీల సడలింపు

image

వ్యవసాయ వినియోగదారులకు ఈ విధానం మరింత ప్రయోజనకరంగా మార్పులు జరిగాయని ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు తెలిపారు. 1 కిలోవాట్‌కు కేవలం ₹1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కొత్త విధానం ద్వారా విద్యుత్ కనెక్షన్ పొందడం మరింత సులభం, వేగవంతంగా పారదర్శకంగా మారిందన్నారు. వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

News March 18, 2026

జీవన్ రెడ్డికి యావత్ కాంగ్రెస్ పార్టీ మద్దతు: దుద్దిళ్ల

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. ఆయన సీనియర్ నాయకుడని, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యం కోరలేదని తెలిపారు. స్థానిక సమస్యల కారణంగానే అసంతృప్తి నెలకొన్నట్టు పేర్కొన్నారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడి పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే తాను కూడా చర్చిస్తానని, జీవన్ రెడ్డికి యావత్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.