News February 3, 2025
కోదాడ స్కూల్ నుంచి స్టూడెంట్స్ పరార్.. పట్టుకున్న పోలీసులు
కోదాడ మం. నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పారిపోవడం ప్రభుత్వ యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఎస్సై అనిల్ రెడ్డి వివరాలు.. పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పారిపోగా ప్రిన్సిపల్ ఝాన్సీ PSలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 3, 2025
ప్రభాస్ ‘కన్నప్ప’ లుక్పై ట్రోల్స్
కన్పప్పలో ప్రభాస్ లుక్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ లుక్ ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో నాగార్జున లుక్ను పోలి ఉందని పలువురు పోస్టులు చేస్తున్నారు. విగ్ సెట్ అవలేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా లుక్పై ఫోకస్ చేయాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ లుక్పై మీ కామెంట్?
News February 3, 2025
గద్వాల ప్రజావాణిలో 28 దరఖాస్తులు.!
గద్వాల జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
News February 3, 2025
టెన్త్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు వచ్చే నెలలో నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గతేడాది 95.2% ఉత్తీర్ణత నమోదయిందని, ఈ ఏడాది 100శాతం నమోదు కావాలన్నారు.