News February 3, 2025
యడ్లపాడు: కలలో కనిపిస్తే.. దేవాలయం నిర్మించారు

యడ్లపాడు మండలం చెంగీజ్ ఖాన్ పేటలో పూజలు అందుకునే వెన్న ముద్ద బాలకృష్ణ స్వామి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. రాజ్య విస్తరణలో భాగంగా కొండవీడుకు వచ్చిన దేవరాయలుకి బాలకృష్ణుడు స్వప్నంలోకి వచ్చాడు. స్వామి ఆదేశాల మేరకు స్వయంభు ఏకశిలా మూర్తిగా ప్రతిష్ఠించారు. బాలకృష్ణని విగ్రహానికి, ఎక్కడ మనకు కనిపించని రీతిలో రాతి లోనే వస్త్రాలతో దర్శనమివ్వటం మరో ప్రత్యేకతగా స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Similar News
News March 21, 2026
త్వరలో ప్రధాని మోదీ తెలంగాణ టూర్!

ప్రధాని మోదీ రానున్న రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో GHMC ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ రెండో వారంలో ప్రధాని టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
News March 21, 2026
శ్రీసత్యసాయి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు చనిపోయారు. పెనుకొండ-అనంతపురం జాతీయ రహదారిపై గుట్టూరు సమీపంలో బ్లాక్ స్పాట్ గుర్తించారు. అక్కడ ప్రమాదాలు అరికట్టేలా హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు.
News March 21, 2026
BREAKING: KNR: భార్య చనిపోయిందని SI సూసైడ్

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈనెల 17న ఆయన <<19415582>>భార్య దివ్య<<>> కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకోగా, మనస్తాపానికి గురైన ఎస్సై సైతం ప్రాణాలు తీసుకున్నారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. మృతదేహాన్ని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.


