News February 3, 2025
ధర్మపురి: శ్రీ లక్ష్మీనరసింహుడి ఆదాయం ఎంతంటే..

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ కార్యక్రమాల ద్వారా అదివారం రూ.2,52,508ల ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,27,092, ప్రసాదాల అమ్మకం- రూ.95,820, అన్నదానం- రూ.29,596లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Similar News
News March 26, 2026
హోప్ ఐలాండ్లో ఆలివ్ రిడ్లే సందడి.. సముద్రంలోకి 585 తాబేళ్లు

అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణలో భాగంగా హోప్ ఐలాండ్ తీరంలో గురువారం 585 తాబేలు పిల్లలను అధికారులు సురక్షితంగా సముద్రంలోకి వదిలారు. JC అపూర్వ భరత్, DFO రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా కార్యక్రమంలో పాల్గొని తాబేళ్ల సందడిని తిలకించారు. తాబేళ్ల గుడ్ల సంరక్షణకు తీరంలో 174 రక్షణ వలయాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 19,858 గుడ్లను పరిరక్షించామని వారు వెల్లడించారు.
News March 26, 2026
విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం.. యువకుల అరెస్ట్

విజయవాడకు చెందిన ఇద్దరు యువకులను పెనమలూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన యువకులు అనంత కుమార్, మహేష్ డ్రగ్స్ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పెనమలూరు పోలీసులు దాడి చేశారు. వారి నుంచి 5 కేజీల గంజాయి, 1 గ్రామ్ కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పెనమలూరు సీఐ వెల్లడించారు. కాగా గ్యాంగ్ వార్ కేసులో అనంత్ కుమార్ నిందితుడిగా ఉన్నాడన్నారు.
News March 26, 2026
కేయూ సైన్స్ ఫ్యాకల్టీలో పీహెచ్డీ ప్రవేశాలు

కాకతీయ యూనివర్సిటీ 2026-2027 విద్యా సంవత్సరానికి గాను సైన్స్ ఫ్యాకల్టీలో పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జీవాలజీ 13, మ్యాథమెటిక్స్ 09, మైక్రోబయోలజీ 06, ఫిజిక్స్ 06, కంప్యూటర్ సైన్స్ 05,
బయోటెక్నాలజీ 04,
బాటనీ 04, కెమిస్ట్రీ 04,
బయోకెమిస్ట్రీ 03, జియాలజీ 01 ఉన్నాయి. ఏప్రిల్ 10 చివరి తేదీ.
వివరాల కోసం అభ్యర్థులు www.kakatiya.ac.in వెబ్సైట్ను చూడవచ్చు.


