News February 3, 2025

MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

Similar News

News April 16, 2026

గ్రామగ్రామాన సీఎం బర్త్ డే వేడుకలు: పూల నాగరాజు

image

సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఈనెల 20న గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని జిల్లా TDP అధ్యక్షుడు పూల నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రి నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

News April 16, 2026

కడప: జాతీయ రహదారిపై కారు బీభత్సం.. ఒకరి మృతి

image

కడప-కర్నూలు జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం ఒక కారు వరుస ప్రమాదాలతో బీభత్సం సృష్టించింది. మైదుకూరు సమీపంలో కారు బైకును ఢీకొనడంతో దువ్వూరు మండలానికి చెందిన శంకర్ రెడ్డి, మోహన్ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అదే కారు చాపాడు మండలం పల్లవోలు వద్ద మరో ప్రమాదానికి కారణమైంది. అక్కడ కారు ఢీకొన్న ఘటనలో కొండయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 16, 2026

పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

image

శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష (పాలిసెట్-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,855 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని అన్నారు. 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.