News February 3, 2025
గజ్వేల్: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
ప్రేమవిఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండపాకలో జరిగింది. ఎస్ఐ వివరాలు.. కొండపాకకు చెందిన ప్రశాంత్(29) శనివారం రాత్రి బయటకు వెళ్తున్నానని తండ్రి ఎల్లయ్యకు చెప్పి వెళ్లిపోయాడు. ఆదివారం పొలానికి వెళ్లిన ఎల్లయ్యకు ప్రశాంత్ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. ప్రశాంత్ ఫోన్ను పరిశీలించగా ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి
గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
News February 3, 2025
అలాగైతే.. పులివెందులకు ఉపఎన్నిక: RRR
AP: MLA ఎవరైనా లీవ్ అడగకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని Dy. స్పీకర్ రఘురామకృష్ణరాజు(RRR) హెచ్చరించారు. ఒకవేళ మాజీ CM జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉపఎన్నిక వస్తుందని చెప్పారు. ఆయన అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు పంచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదాను స్పీకర్, CM కాదు ప్రజలు ఇవ్వాలని తెలిపారు. తన కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ పాత్ర స్పష్టమైందన్నారు.
News February 3, 2025
10న జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమం: కలెక్టర్
జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న మొదటి దశ జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు.