News February 3, 2025

GNT: SI అంటూ బెదిరించి రూ.24లక్షలు స్వాహా

image

ఎస్ఐ అంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.24 లక్షలు దోచేసిన వైనంపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నెహ్రు నగర్‌కి చెందిన నాగేశ్వరరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎస్ఐ ప్రసాద్‌ను అని చెప్పాడు. బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నాడు. ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయని నాగేశ్వరావుని బెదిరించి విడతల వారీగా రూ.24లక్షలు నకిలీ ఎస్ఐ ఖాతాలోకి జమ చేయించుకున్నాడు. 

Similar News

News March 21, 2026

గుంటూరులో కట్టుదిట్టమైన భద్రత

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గుంటూరు, పొన్నూరు, తెనాలి పత్తిపాడు, తాడికొండ, మంగళగిరి మసీదులు, ఈద్గాలు, ప్రార్థనా మందిరాల వద్ద అదనపు పోలీసు బలగాలు మోహరించి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణతో పాటు అత్యవసర సేవల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

News March 21, 2026

GNT: PACS ఉద్యోగులకు డిగ్రీ నిబంధనపై అసంతృప్తి

image

PACS సిబ్బందికి ప్రమోషన్ల కోసం డిగ్రీ అర్హత తప్పనిసరి చేయడం వివాదంగా మారింది. ఉమ్మడి GNT జిల్లాలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగులు దీనిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 20ఏళ్లకు పైగా సేవ చేస్తున్న వారిని ఇప్పుడు చదువు పూర్తి చేయాలని కోరడం కష్టమని అంటున్నారు. 2020లో రూపొందించిన HR పాలసీ అమలు కాకపోయినా కొత్త నిబంధనలు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యోగులు మరికొంత గడువు ఇవ్వాలంటున్నారు.

News March 21, 2026

సామాన్యుడిలా తిరుమల దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు

image

సీఎం హోదాలో ఉన్న ప్రొటోకాల్ పక్కనపెట్టి సామాన్యుడిలా క్యూ కాంప్లెక్స్ వెళ్లి చంద్రబాబు కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇవాళ దర్శనం చేసుకుంది. శనివారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ మార్గంలో వెళ్తూ టీటీడీ ఏర్పాట్లు, భ‌క్తుల ఇబ్బందులు చంద్రబాబు పరిశీలించి స్వయంగా తెలుసుకున్నారు. లోపాలను వెంటనే సరిదిద్దాలని టీటీడీ అధికారులకు సూచించారు.