News March 19, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710786856225-normal-WIFI.webp)
✓ పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓రెండవ రోజు కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు
✓తల్లాడ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి మండలం లో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం జిల్లాలో ఓటు నమోదు పై ప్రత్యేక కార్యక్రమం
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
Similar News
News July 5, 2024
చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి ఆరు నెలల జైలు, 3 లక్షల జరిమానా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720175135348-normal-WIFI.webp)
మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు, మూడు లక్షల జరిమానాను విధిస్తూ మణుగూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరిరెడ్డి శుక్రవారం తీర్పునిచ్చారు. గుత్తుల శ్రీనివాసరావు వద్ద సుందరయ్యనగర్కి చెందిన చింతల రాజారాం 2015 సంవత్సరంలో 3 లక్షల అప్పుగా తీసుకుని డబ్బు కోసం తిరగ్గా చాలా రోజుల తర్వాత చెక్ను ఇచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది.
News July 5, 2024
ఖమ్మం శివారు రైల్వే పట్టాలపై మృతదేహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720169435814-normal-WIFI.webp)
ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెం వద్ద రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.
News July 5, 2024
వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720153170155-normal-WIFI.webp)
కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి.