News February 3, 2025

కొడుకులు తరిమేశారు: వృద్ధ దంపతులు

image

కన్న కొడుకులు ఆస్తి రాయించుకుని తరిమేశారని డోన్ పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు గంగిరెడ్డి, సుబ్బరత్నమ్మ వాపోయారు. తాము కష్టబడి సంపాదించిన ఇల్లు, ఆస్తులన్నింటినీ కుమారులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, పత్తికొండలోని శారదా వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నామని తెలిపారు. తమకు న్యాయం కావాలని కోరుతూ డోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

Similar News

News February 3, 2025

HYD: అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ ఫైర్

image

లక్ష డప్పులు.. వేయి గొంతులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. సీఎం, డీజీపీ HYD సిటీ సీపీ పునరాలోచించాలని, పునఃసమీక్ష చేసి అనుమతిని మంజూరు చేయాలన్నారు. MRPS ఏ రోజూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేయలేదని, మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న డప్పులు మళ్లీ పునరుజ్జీవం పోసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

News February 3, 2025

నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 3, 2025

వరంగల్‌: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

image

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.