News February 3, 2025
రేపే రథసప్తమి.. విశేషాలివే
మాఘ శుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకొంటారు. ఆరోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరాయణ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. దేశవ్యాప్తంగా సూర్యభగవానుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. సూర్య పూజ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను, సిరి సంపదల్ని చేకూరుస్తుందనేది భక్తుల విశ్వాసం. సూర్యకిరణాలు ఒంటిపై పడటం ఆరోగ్యకరమని నమ్మిక. ఆదిత్య హృదయం, సూర్యాష్టోత్తర శతనామాల పఠనం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు.
Similar News
News February 3, 2025
ఎక్స్లెంట్ ఇన్నింగ్స్.. థాంక్యూ సాహా: BCCI
వృద్ధిమాన్ సాహా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సేవలను కొనియాడుతూ BCCI పోస్టర్ విడుదల చేసింది. సాహాది అద్భుతమైన కెరీర్, ఎక్స్లెంట్ ఇన్నింగ్స్ అని పేర్కొంది. భారత జట్టుకు అందించిన సేవలకు థాంక్స్ చెప్పింది. భవిష్యత్తు మంచిగా సాగాలని కోరుకుంటున్నట్లు విష్ చేసింది. సాహా 28ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ తదితర లెవెల్స్లో క్రికెట్ ఆడారు.
News February 3, 2025
‘తీన్మార్ మల్లన్న ఏ పార్టీ?’
TG: కాంగ్రెస్ MLC నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న) ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. దీనిపై పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతగా ఉండి సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఏంటని విస్తు పోతున్నారు. దీంతో ఆయన ఏ పార్టీ నేత అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
News February 3, 2025
రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: జయశంకర్
లోక్సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగమంత్రి జయశంకర్ ఫైరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించామని కోరడానికి తాను అమెరికాకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధం అన్నారు. విదేశాంగ కార్యదర్శిని కలవటానికే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన మోదీ లాంటి నాయకుడిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం సరికాదని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.