News February 3, 2025

ములుగు: ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

Similar News

News March 12, 2026

బాపట్ల కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

image

సీఎం చంద్రబాబు బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌ను ప్రశంసించారు. గురువారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో బాపట్ల బీచ్ అభివృద్ధిపై పీపీటీ ద్వారా సీఎం చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు. సూర్యలంకను గోవా తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. మరో గోవాను చేస్తావా? నీపై నమ్మకం ఉంది అని సీఎం కలెక్టర్‌ను ప్రశంసించారు.

News March 12, 2026

సిలిండర్లు నిల్వ ఉంచుకోవద్దు.. కేంద్రం సూచన

image

దేశంలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. LPG ఉత్పత్తి పెంపు, సరఫరాలో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. 2.5 రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది హడావుడిగా బుకింగ్స్ చేయడం లేదా సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

News March 12, 2026

విద్యార్థులకు మాతృ హృదయంతో బోధించాలి: డా. స్వప్న

image

పిల్లలకు మొదటి గురువు తల్లి అని, విద్యార్థులకు మాతృ హృదయంతో బోధించాలని సెన్సార్ బోర్డు మెంబర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కళ్లెం స్వప్న అన్నారు. గురువారం తపస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ సుజాత అధ్యక్షతన మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయుల బోధన విద్యార్థుల్లో ప్రగాఢ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు.