News February 3, 2025

వచ్చే నెల మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోజు 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News January 18, 2026

సిద్దిపేట: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు 5 నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 18, 2026

సంగారెడ్డి: తప్పిపోయిన ఇద్దరు చిన్నారులు.. ఆచూకీ తెలిస్తే తెలపండి

image

ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు చిన్నారులు 15 రోజులుగా కనిపించడం లేదని, వారి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య శనివారం విజ్ఞప్తి చేశారు. అన్న్ (5), అన్షిక (4) అనే ఇద్దరు పిల్లలు ఈనెల 2వ తేదీ నుంచి తప్పిపోయారని ఆమె తెలిపారు. ఈ చిన్నారుల గురించి ఎలాంటి సమాచారం లభించినా వెంటనే 08455-271401 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

News January 18, 2026

బల్దియాలో బీసీ ఓటర్ల గణన: ఇంటింటికీ మొబైల్ సర్వే!

image

TGలోని ఇతర కార్పొరేషన్లలో BC రిజర్వేషన్లు పూర్తయినా GHMCలో మాత్రం ‘ఓటర్ల గణన’ కోసం ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. హద్దులు మారిన నేపథ్యంలో ప్రతి డివిజన్‌లో BCల సంఖ్యను తేల్చేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ ద్వారా సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ డిజిటల్ డేటా ఆధారంగానే ఏ వార్డును BCలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. <<18882458>>SMలో<<>> వస్తున్న ఊహాజనిత జాబితాను నమ్మవద్దని ఎన్నికల విభాగం హెచ్చరిస్తోంది.