News February 3, 2025

NRPT: క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన

image

నారాయణపేట జిల్లా ఆసుపత్రి ఆవరణలో సోమవారం ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, క్యాన్సర్‌కు కారణమైన వాటికి దూరంగా ఉండాలని క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. న్యాయవాదులు, డాక్టర్లు పాల్గొన్నారు.

Similar News

News February 5, 2026

HYD: ఏడుపాయల మహా జాతర తేదీలు ఇవే..!

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల మహాజాతరకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జాతరకు మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, గ్రేటర్ HYD, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది వరకు భక్తులు రానున్నారు. SHARE IT

News February 5, 2026

HYD: ఏడుపాయల మహా జాతర తేదీలు ఇవే..!

image

తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల మహాజాతరకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జాతరకు మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, గ్రేటర్ HYD, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది వరకు భక్తులు రానున్నారు. SHARE IT

News February 5, 2026

మేం వెళ్తున్నాం.. ఫ్లైట్ బుక్ చేశాం: సూర్య

image

T20 WCలో ఈనెల 15న జరిగే లీగ్ మ్యాచ్‌ను పాక్ <<19024958>>బాయ్‌కాట్ చేయడం<<>>పై టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంలో తమ జట్టు సన్నద్ధతలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ‘మేం స్పష్టంగానే ఉన్నాం. వాళ్ల(పాకిస్థాన్)తో ఆడబోమని మేం చెప్పలేదు. అలా అన్నది వాళ్లే. USA, కెనడాతో మ్యాచ్‌ల తర్వాత మేం కొలంబో వెళ్తాం. మా ఫ్లైట్ బుక్ అయింది. మేం వెళ్తున్నాం’ అని కెప్టెన్స్ మీట్‌లో చెప్పారు.