News February 3, 2025
NRPT: క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన
నారాయణపేట జిల్లా ఆసుపత్రి ఆవరణలో సోమవారం ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, క్యాన్సర్కు కారణమైన వాటికి దూరంగా ఉండాలని క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. న్యాయవాదులు, డాక్టర్లు పాల్గొన్నారు.
Similar News
News February 3, 2025
గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్
TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.
News February 3, 2025
ట్రంప్తో మోదీ భేటీ.. ఎప్పుడంటే?
PM మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఈ నెల రెండోవారంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఫిబ్రవరి 13న వాషింగ్టన్లో ట్రంప్తో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మోదీతో సమావేశం నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గత నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
News February 3, 2025
నవీపేట్: కోడి పందేలు ఆడుతున్న ఆరుగురి అరెస్టు
నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం కొంత మంది కోడి పందేలు ఆడుతుండటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి 2 కోడిపుంజులు, రూ.4650 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నలుగురు నిజామాబాద్, ఒకరు సిరంపల్లి, మరొకరు తీర్మాన్పల్లికి చెందిన వారు ఉన్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ వినయ్ వెల్లడించారు.