News February 3, 2025
సిరిసిల్ల: మహిళలకు భద్రత కల్పిస్తున్న పోలీస్ అక్క: ఎస్పీ

జిల్లాలోని మహిళలు, విద్యార్థినులకు భద్రతకు జిల్లా షీ టీం, పోలీస్ అక్క భరోసా కల్పిస్తున్నాయని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 03 కేసులు, 08 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినులు ఎవరైనా వేధింపులకు గురైతే 8712656425 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 23, 2026
కోదండ రాముని సన్నిధిలో TTD జేఈవో

ఒంటిమిట్ట కోదండ రామయ్యను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద బ్రహ్మోత్సవాలకు చేస్తోన్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలను, సలహాలు అందజేశారు.
News March 23, 2026
పెండింగ్ బకాయిల విడుదల, PRCపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. పెండింగ్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ప్రతినెలా ఇస్తోన్న ₹700 కోట్లను ₹1,000 కోట్లకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 1వ తేదీనే జీతాలు, క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్, పెండింగ్ DAల విడుదల, ₹1.25 కోట్ల ప్రమాద బీమా వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే PRCపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
News March 23, 2026
‘సిండికేట్’ సొమ్ములో నేతల వాటాలెంత.?

చిత్తూరు జిల్లాలో ‘<<19453401>>సిండికేట్<<>>’పై ఆది నుంచి పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. టమాటా నుంచి మామిడి వరకు ప్రతిచోట దళారులు ఏకమై పంట రేట్లు పడిపోయేలా చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండనకా, వాననకా పండించిన పంటను కొందరు బడా నేతల సాయంతో తేలిగ్గా కొట్టేస్తున్నారట. ఇప్పుడు యుద్ధం పేరు చెప్పి తమను నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. అయినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారట.


