News February 3, 2025
20న విడుదల కానున్న TS- EAPCET నోటిఫికేషన్

JNTU వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TS- EAPCET 2025 పరీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు నేడు మొట్టమొదటి సెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30వ తేదీన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలతో పాటు మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Similar News
News November 7, 2025
నాకు విజయ్తో శత్రుత్వం లేదు: అజిత్

కోలీవుడ్లో ఫ్యాన్ వార్పై హీరో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. దళపతి విజయ్తో తనకు వైరం ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ‘కొందరు నాకు, విజయ్కు శత్రుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి అభిమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు సృష్టించే వారు మౌనంగా ఉండటం మంచిది. నేనెప్పుడు <<18165294>>విజయ్ మంచినే<<>> కోరుకుంటా’ అని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాటకు అందరూ బాధ్యులేనని అజిత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
News November 7, 2025
లావెండర్ నూనెతో మేనికి మెరుపు

అందాన్ని పెంచడంలో ఎసెన్షియల్ ఆయిల్స్ కీలకంగా పనిచేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది లావెండర్ ఆయిల్. దీన్ని ఎలా వాడాలంటే..* 2చుక్కల లావెండర్ నూనెని పావుకప్పు బ్రౌన్ షుగర్లో కలిపి, స్నానం చేసేముందు ఒంటికి రుద్దుకోవాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి మొటిమలు, యాక్నేను తగ్గిస్తుంది. * అరటిపండు గుజ్జు, తేనె, 2చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.
News November 7, 2025
దామోదరా.. ఎంజీఎం సంగతేంది..!

MGM ఖాళీలతో సతమతం అవుతోంది. మంత్రి దామోదర రాజ నర్సింహ కేవలం సూపరింటెండెంట్ను మార్చి, ఖాళీగా ఉన్న RMO పోస్టులను అత్యవసర విభాగం వారితో నడిపిస్తున్నారు. కొన్నేళ్లుగా RMO-1, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం మంగళవారం కల్పించిన పదోన్నతులతో ప్రస్తుతం విధుల్లో ఉన్న డిప్యూటీ RMO-2 ఎం.వసంతారావు సంగారెడ్డి(D) వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులయ్యారు. దీంతో ప్రస్తుతం 3 RMO పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


