News February 3, 2025

HYD: రూ.250 కోట్లతో 88 నూతన సబ్‌స్టేషన్లు..!

image

HYD మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాలకు చెందిన జోన్లలో ఒక్కోజోన్లలో నిర్మించాల్సిన సబ్ స్టేషన్ల కోసం టెండర్లు పిలవాల్సి ఉంది. రూ.250 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 88 విద్యుత్ ఉపకేంద్రాలను జోన్లవారిగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే వేసవి డిమాండ్ మేరకు చర్యలు చేపడుతున్నారు.

Similar News

News March 19, 2026

మెదక్: విషాదం.. వ్యక్తి సూసైడ్

image

నిజాంపేట మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పంజా సత్తయ్య(46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరిగి, తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2026

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News March 19, 2026

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: కడప SP

image

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని SP నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్ల పరిధిలో నేరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.