News February 3, 2025

క్యాన్సర్ లక్షణాలు ఉంటే పరీక్షించుకోవాలి: దేశ్ పాండే

image

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి దేశ్ పాండే మాట్లాడుతూ.. రోజురోజుకూ వివిధ రకాలైన క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని, తద్వారా నయం చేయవచ్చన్నారు.

Similar News

News October 18, 2025

HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

image

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్‌వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News October 18, 2025

HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

image

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్‌వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News October 18, 2025

తెలుగులో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు

image

రావూరి భరద్వాజ (జులై 5, 1927- అక్టోబరు 18, 2013) గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు. తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా ఆయన పేరుతెచ్చుకున్నారు. ఆయన 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించారు.
#నేడు ఆయన వర్ధంతి