News February 3, 2025

10న జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమం: కలెక్టర్

image

జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న మొదటి దశ జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News November 16, 2025

జగిత్యాల: 4 జంటలను కలిపిన లోక్ అదాలత్

image

జగిత్యాల జిల్లా కోర్టులో NOV 15 నుంచి జరుగుతున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సూచించారు. సంవత్సరాల తరబడి లాగకుండా, రాజీతో వేగంగా కేసులను పరిష్కరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసుల చొరవతో విడాకుల అంచున ఉన్న నలుగురు దంపతులను ఈ లోక్ అదాలత్ మళ్లీ కలిపింది.

News November 16, 2025

సిరిసిల్ల: పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న జనం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఒక్కసారిగా పెరిగిన చలితో జనం వణుకుతున్నారు. చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలపై ప్రజలు దృష్టి సారించారు. వృద్ధులు, చిన్నపిల్లలు చలి మంటలు వేసుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్వెటర్లు, మఫ్లర్ ధరించడం ద్వారా కొంత ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో రాత్రివేళ రుద్రంగిలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, ఇల్లంతకుంటలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News November 16, 2025

సిరిసిల్ల: రబీలో లక్ష 94 వేల ఎకరాల్లో పంట సాగుకు అంచనా

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రబీ సీజన్ (యాసంగి)లో సుమారు లక్ష 94 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1,83,000 ఎకరాల్లో వరి సాగుకు, 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు తదితర పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు ఇందుకు గాను 45,312 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేశారు.