News February 3, 2025

నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News January 23, 2026

నెల్లూరు: జవాన్‌పై దాడి.. ఇరు వర్గాలపై కేసు

image

BSF జవాన్ జోడు వెంకటప్రసాద్‌పై దాడి కేసులో పరస్పర ఫిర్యాదులు అందడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీతారాంపురం ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఒడిశాలో పనిచేస్తున్న ఆయన కుటుంబంతో కలిసి సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో పాతకక్షలను దృష్టిలో ఉంచుకున్న స్థానికులు బంధుగుల ప్రసాద్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు గ్రామ రోడ్డు సెంటర్లో ఉన్న జవాన్‌పై మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు.

News January 23, 2026

నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

image

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.

News January 22, 2026

నెల్లూరు: ఆక్వా రైతులకు లైసెన్స్‌ తప్పనిసరి

image

నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుకు కరెంట్ సబ్సిడీ లబ్ధికి అనుమతులు తప్పనిసరి అని మత్స్యశాఖ అధికారిని శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. APSADA & CAA చట్ట నిబంధనల మేరకు ఆక్వా సాగు చేయు (మంచి నీటి & ఉప్పు నీటి వనరులలో) ప్రతి రైతు కరెంటు సబ్సిడీని పొందుటకు తప్పనిసరిగా మత్స్యశాఖ ద్వారా లైసెన్సు పొందాలన్నారు. అనుమతి పొందని వారు ఈనెల 31వ తేదీ లోగా సచివాలయం ద్వారా లైసెన్సు దరఖాస్తు చేసుకోవాలన్నారు.