News February 3, 2025
NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగులో పెట్టవద్దు: ఎస్పీ
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం 5 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో వుంటే డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.
Similar News
News February 4, 2025
PPM: ప్రతికూల వార్తలపై అధికారులు తక్షణమే స్పందించాలి
జిల్లాలో సంస్థాగతంగా ప్రజలకు సేవలు అందించడంలో లోపాలు పట్ల వివిధ పత్రికల్లో వస్తున్న ప్రతికూల వార్తలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
News February 4, 2025
శుభ ముహూర్తం(04-02-2025)
✒ తిథి: శుక్ల షష్ఠి ఉ.7.53 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.12.52 వరకు
✒ శుభ సమయం: సా.4.22 నుంచి 5.22 వరకు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 వరకు
✒ వర్జ్యం: రా.9.15 నుంచి 10.45 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.55 -రా.7.24 వరకు
News February 4, 2025
నులి పురుగుల నివారణ మాత్రలను మింగించండి : కలెక్టర్
జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 10వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. 1663 అంగన్వాడీ కేంద్రాలు, 1957 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ 400 గ్రాముల మాత్రలను మింగించాలని కలెక్టర్ సూచించారు.