News February 3, 2025
NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగులో పెట్టవద్దు: ఎస్పీ

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం 5 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో వుంటే డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.
Similar News
News March 26, 2026
MDK: డబ్బాలలో పెట్రోల్, డీజిల్ నిల్వ నిషేధం: ఎస్పీ

డబ్బాలు లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయవద్దని సూచించారు. పెట్రోల్ బంక్ డీలర్లు నిషేధ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
News March 26, 2026
KNR: అసెంబ్లీ ముట్టడికి యత్నం.. DYFI నేతల అరెస్టు

యువజన హక్కుల సాధనకై DYFI పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలైన 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా ప్రభుత్వం యువతను వంచిస్తోందని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.
News March 26, 2026
24/7 లిక్కర్ అవైలబుల్.. @KNR రీజియన్

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలవడంతో 24/7 లిక్కర్ అందుబాటులో ఉంటుంది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియుల నడ్డి విరుస్తున్నారు. ఉమ్మడి KNRలో 287 మద్యం షాపులు కొనసాగుతున్నాయి. రూల్స్ బ్రేక్ చేసి పర్మిట్ రూంల నిర్వహణ విచ్చలవిడిగా ఉండడంతో తాగేంత చుక్క.. అంచుకు ముక్కతో బార్లను తలపిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా ఎక్సైజ్ శాఖ కనసన్నల్లోనే కొనసాగుతుందన్న టాక్ వినబడుతోంది.


