News February 3, 2025

ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

image

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.

Similar News

News March 21, 2026

సహజత్వానికి భంగం కలగకుండా భద్రాచలం ఆలయ అభివృద్ధి: CM

image

TG: భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి 2027 మార్చి 31 నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆదేశించారు.

News March 21, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤అరసవల్లి ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రం విడుదల
➤ సోంపేట: తగ్గిన టమాట ధర..లబోదిబోమంటున్న రైతులు
➤మెళియాపుట్టి: రోడ్డు వేయించండి ఎమ్మెల్యే సార్
➤లావేరు: అడుగుకో గుంత.. వెళ్లేదెలా ?
➤బూర్జ: వర్షాలకు నేల రాలిన మామిడి
➤పలాస: భవనం పైనుంచి జారిపడి కార్మికుడు మృతి
➤శ్రీకాకుళం జిల్లాలో రంజాన్ వేడుకలు
➤పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు

News March 21, 2026

IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

image

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.