News February 3, 2025
అల్లూరి: జాబ్ మేళా లో 105మంది ఎంపిక

అల్లూరి జిల్లాలోని చింతూరు గురుకుల పాఠశాలలో పోలీస్ శాఖ సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలో 105 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. సెల్ ఫోన్స్ తయారీకి ఎన్నో సోర్స్ అనే సంస్థ వీరందరికి ముందుగా శిక్షణ ఇస్తుందని అన్నారు. విలీన మండలాల్లో పలు గ్రామాలకు చెందిన యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని చెప్పారు. ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Similar News
News March 11, 2026
ఎంజీయూ M.Ed పరీక్షల షెడ్యూల్ విడుదల

నల్గొండ: ఎంజీయూ పరిధిలో M.Ed మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 13 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు పూర్తి టైమ్ టేబుల్ కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. సంబంధిత కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
News March 11, 2026
విశాఖ జిల్లాలో రికార్డ్ లెవల్లో రిఫండ్.. ఎన్ని కోట్లంటే?

సైబర్ నేరాల బాధితులకు రిఫండ్ అందించడంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో 1,240 మంది బాధితులకు రూ. 22.47 కోట్లు రిఫండ్ చేయగా, 558 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లోన్ యాప్ కేసుల్లో రూ. 60 లక్షల క్రిప్టో స్వాధీనం చేసుకున్నారు. మోసపోతే తక్షణమే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
News March 11, 2026
టెన్త్ ఎగ్జామ్స్.. 19,835 మంది విద్యార్థులు: నల్గొండ DEO

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. DEO బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,143 మంది బాలురు, 9,551 మంది బాలికలు ఉండగా, 137 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.


