News February 3, 2025

జనగామ:  5న కిసాన్ మేళా వ్యవసాయ ప్రదర్శన

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 5న రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కిసాన్ మేళాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని ప్రదర్శన రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 8, 2026

ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఇంటర్ పబ్లిక్ పరీక్షలు–2026 పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఒకేషనల్ ప్రాక్టికల్స్ 27 ఫిబ్రవరి 10, జనరల్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1–10, థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23–మార్చి 24 వరకు 98 కేంద్రాల్లో జరుగుతాయని తెలిపారు. మొత్తం 76,268 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు.

News January 8, 2026

నంద్యాలలో వచ్చే నెలలో ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నీ

image

వచ్చే నెల 21, 22వ తేదీల్లో నంద్యాలలో ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెస్ సంఘం నంద్యాల జిల్లా ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షుడు రవికృష్ణ తెలిపారు. పట్టణంలో అంతర్జాతీయ స్థాయిలో చదరంగం పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని వారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఫిబ్రవరి 15వ తేదీ లోపు www.apchess.orgలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

News January 8, 2026

​స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో బాపట్ల ముందుండాలి: కలెక్టర్

image

​రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి కీలక ప్రగతి సూచికల్లో (KPIs) మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.