News March 19, 2024

BREAKING: ‘చట్నీస్’ హోటల్‌కు షాక్..!

image

ప్రముఖ అల్పాహార హోటల్ సంస్థ చట్నీస్‌కు షాక్ తగిలింది. ఆ సంస్థపై ఐటీ అధికారులు ఈరోజు సోదాలు జరిపారు. ఈ సంస్థ యజమాని అట్లూరి పద్మ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు కావడం గమనార్హం. అటు ఆమె ఇంటి వద్ద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షర్మిల తనయుడు రాజారెడ్డికి, పద్మ కుమార్తె ప్రియకు ఇటీవల ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News July 8, 2024

అలా అయితే రీ-నీట్‌కు ఆదేశిస్తాం: సుప్రీం

image

నీట్ పవిత్రతను NTA దెబ్బతీసిందని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా రీ-టెస్ట్‌కు ఆదేశిస్తామని పేపర్ లీకేజీపై విచారణ సందర్భంగా SC స్పష్టం చేసింది. ‘లీకైన పేపర్ వైరల్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. ముందు పేపర్ ఎలా లీకైంది? ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి’ అని వ్యాఖ్యానించింది.

News July 8, 2024

ఎంతో ముఖ్యమైన క్యాచ్ 8 ఏళ్ల క్రితమే పట్టేశా: SKY

image

సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. టీ20 WC విన్నింగ్ క్యాచ్‌ను తన వైఫ్‌తో పోల్చారు. ‘స్టన్నింగ్ క్యాచ్ పట్టి నిన్నటికి 8 రోజులవుతోంది. కానీ అత్యంత ముఖ్యమైన క్యాచ్‌ను నిజానికి నేను 8 ఏళ్ల క్రితమే పట్టేశాను’ అని పేర్కొన్నారు. తన భార్య దేవిషా శెట్టి పరిచయమై 8 ఏళ్లవుతోందని ఇలా చెప్పుకొచ్చారు. కాగా T20 WC-2024 ఫైనల్స్‌లో చివరి ఓవర్‌లో SKY అద్భుత క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే.

News July 8, 2024

శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య

image

శ్రీలంక క్రికెట్ టీమ్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. ఇప్పటినుంచి సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌ పర్యటన వరకూ ఆయన కోచ్‌గా కొనసాగుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఆయన ఆ జట్టుకు ఫుల్ టైమ్ క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. శ్రీలంకకు 445 ODI, 110 టెస్టులు, 31 T20ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆయన మొత్తం 21,032 రన్స్ చేశారు. ఇందులో 42 సెంచరీలున్నాయి.