News February 3, 2025

తిరుపతిలో 144 సెక్షన్ అమలు: కలెక్టర్

image

తిరుపతి పట్టణంలో 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అమలులో ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.

Similar News

News March 23, 2026

కోదండ రాముని సన్నిధిలో TTD జేఈవో

image

ఒంటిమిట్ట కోదండ రామయ్యను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద బ్రహ్మోత్సవాలకు చేస్తోన్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలను, సలహాలు అందజేశారు.

News March 23, 2026

పెండింగ్ బకాయిల విడుదల, PRCపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. పెండింగ్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ప్రతినెలా ఇస్తోన్న ₹700 కోట్లను ₹1,000 కోట్లకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 1వ తేదీనే జీతాలు, క్యాష్‌లెస్‌ హెల్త్ కార్డ్స్, పెండింగ్ DAల విడుదల, ₹1.25 కోట్ల ప్రమాద బీమా వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే PRCపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 23, 2026

‘సిండికేట్‌’ సొమ్ములో నేతల వాటాలెంత.?

image

చిత్తూరు జిల్లాలో ‘<<19453401>>సిండికేట్<<>>’పై ఆది నుంచి పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. టమాటా నుంచి మామిడి వరకు ప్రతిచోట దళారులు ఏకమై పంట రేట్లు పడిపోయేలా చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండనకా, వాననకా పండించిన పంటను కొందరు బడా నేతల సాయంతో తేలిగ్గా కొట్టేస్తున్నారట. ఇప్పుడు యుద్ధం పేరు చెప్పి తమను నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. అయినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారట.