News February 3, 2025

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సౌడ రమేశ్

image

 బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా సౌడ రమేశ్‌ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సౌడ రమేశ్ మాట్లాడుతూ.. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన రమేశ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 11, 2025

నిఠారి కిల్లింగ్స్: సురేంద్ర కోలికి సుప్రీంలో ఊరట

image

నిఠారి వరుస హత్యల చివరి కేసులో సురేంద్ర కోలి దోషి కాదని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. మిగతా కేసుల్లోనూ రిలీఫ్ పొందిన కోలి త్వరలో జైలు నుంచి విడుదల కానున్నాడు. నోయిడా శివారు నిఠారి గ్రామంలో 2006 DEC 29న మోహిందర్ పందేర్ ఇంటి వెనక డ్రెయిన్‌లో 8 మంది చిన్నారుల ఎముకలు లభ్యమయ్యాయి. దీనిపై దర్యాప్తు చేసిన CBI పందేర్, కోలి హత్యాచారాలకు పాల్పడ్డారని తేల్చింది. అయితే కోర్టుల్లో నిరూపించలేకపోయింది.

News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటు వేసేందుకు యువతులు సైతం ఆసక్తి చూపించారు. యూసుఫ్‌గూడలోని పలు పోలింగ్ బూత్‌లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ ఓటర్లకు ఓటింగ్ ఛాలెంజ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యతను గుర్తు చేశారు. వెంగళరావునగర్‌ డివిజన్ పరిధిలోని కొన్ని బూత్‌లలో రద్దీ లేదని టాక్.

News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. యూసుఫ్‌గూడలోని పలు పోలింగ్ బూత్‌లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ స్నేహితులకు సందేశం పంపుతున్నారు. యువత.. మీరూ కొంచెం ఆలోచించండి. ఓటు వేసి SMలో ఒక పోస్ట్ పెట్టండి. ఇంకా ఓటు వేయనివారిని పోలింగ్‌కు తీసుకెళ్లండి.