News February 3, 2025
జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సౌడ రమేశ్

బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా సౌడ రమేశ్ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సౌడ రమేశ్ మాట్లాడుతూ.. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన రమేశ్కు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News July 4, 2025
జగిత్యాల: ‘మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం’

మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా రోశయ్య 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత తదితరులున్నారు.
News July 4, 2025
మొహర్రం పర్వదినం.. తిరుపతి ఎస్పీ విజ్ఞప్తి

మొహర్రం పర్వదినం సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రహదారులపై బైక్ ర్యాలీలు, మితిమీరిన శబ్దంతో డీజేలపై నిషేధం ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో మొహర్రం పండుగను చేసుకోవాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News July 4, 2025
జగిత్యాల: ‘వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి’

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్‘ ( మన తల్లి పేరిట ఒక మొక్క నాటుదాం) కార్యక్రమాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం అయన ప్రారంభించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని సహకార సంఘాల పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.