News February 3, 2025

ఈనెల 6 మంత్రి ఫరూక్ సమీక్ష

image

రాష్ట్రంలో న్యాయశాఖ సంబంధించిన పాలనాపరమైన వివిధ అంశాలపై ఈనెల 6వ తేదీన సమీక్ష చేస్తున్నట్లు సోమవారం మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచి ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణ విషయంపై కూడా న్యాయశాఖ కార్యదర్శితో చర్చించడం జరుగుతుందని మంత్రి ఫరూక్ వెల్లడించారు.

Similar News

News July 7, 2025

పాశ మైలారం: ఆచూకీ తెలియని 8 మంది వివరాలు

image

పాశ మైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. వెంకటేశ్, రవి, రాహుల్, విజయ్, ఇర్ఫాన్, అఖిలేశ్, జస్టిన్, శివాజీ ఆచూకీ లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. వీరి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పటాన్‌చెరులోనే పడిగాపులు కాస్తున్నారు.

News July 7, 2025

PHOTO OF THE DAY..❤❤

image

అమ్మానాన్న లేరు. వీధివీధి తిరిగి భిక్షం ఎత్తుకోవడం, బస్టాండ్లలో నిద్రపోయే దీనపరిస్థితి ఆ ఇద్దరు చిన్నారులది. వాళ్లకూ ఓ మంచిరోజు వచ్చింది. ‘<<16930776>>సార్.. మేమూ చదువుకుంటాం<<>>’ అంటూ నెల్లూరు VRస్కూల్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్‌ను వేడుకోవడంతో వారి జీవితం మారిపోయింది. వారం తిరగకముందే మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అదే స్కూల్లో అడ్మిషన్లు పొందారు. ఇప్పుడు ఆ ఇద్దరూ అందరిలా పాఠాలు నేర్చుకోనున్నారు.

News July 7, 2025

రోడ్డు ప్రమాదంలో ఆపరేషన్ సింధూర్ జవాన్ మృతి

image

పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో సేవలందించిన ఆయన, కుటుంబంతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నల్గొండ దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు కుమారుడు అవినాశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.