News February 3, 2025
మేడ్చల్ జిల్లాలో 29.48 లక్షల మంది ఓటర్లు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 29.48 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 15.17 లక్షలు కాగా.. మహిళలు 14.30 లక్షలు, ఇతరులు 416 మంది ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 4, 2025
సిద్దిపేటలో 14 మందికి జరిమానా
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 14 మందికి రూ.22,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించి 14 మందిని అరెస్ట్ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించినట్లు వెల్లడించారు.
News February 4, 2025
NZB: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో 4 మెడల్స్
జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన దినేష్ వాగ్మారే 4 మెడల్స్ సాధించాడు. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో 35 ఏళ్ల కేటగిరిలో ప్రాతినిధ్యం వహించిన దినేష్ లాంగ్ జంప్ లో సిల్వర్, రిలే లో సిల్వర్ మెడల్, ట్రిపుల్ జంప్లో బ్రాంజ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. దీంతో ఆయన వ్యక్తిగత ఖాతాలో మొత్తం నాలుగు మెడల్స్ నమోదు చేసుకున్నాడు.
News February 4, 2025
గీసుగొండ సీఐ హెచ్చరిక
సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో వివాదాస్పదంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టుకుంటున్న విషయం తమ దృష్టికి రాగా వారిని గీసుగొండ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.