News February 3, 2025
కుప్పంలో పట్టపగలు వరుస చోరీలు

కుప్పం పట్టణంలో మధ్యాహ్నం రెండిళ్లలో వరుస చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి రెండిళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. టీబీ రోడ్డు సమీపంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో బీరువాను పగలగొట్టి చోరీ చేయడంతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ను దొంగ ఎత్తుకెళ్లాడు. అదేవిధంగా ప్యాలెస్ ఏరియాలో సైతం ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.
Similar News
News March 13, 2026
చిత్తూరు జిల్లాలో డబ్బుల వసూలు.. అసలు నిజం ఇదే!

చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల వేళ డబ్బులు ఇస్తే పాస్ చేస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై DEO రాజేంద్ర ప్రసాద్ విచారణ చేపట్టారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫేర్వెల్ డేకు నగదు తీసుకున్నారని చెప్పారు. ఈ డబ్బులే పరీక్షల్లో పాస్ చేయడానికి అని ప్రచారం చేయడం సరికాదన్నారు. చట్ట విరుద్ధ చర్యలకు చేపడితే కఠిన చర్యలు తప్పవని DEO హెచ్చరించారు.
News March 13, 2026
ఇళ్ల నిర్మాణాల్లో చిత్తూరు జిల్లాకు తొలి స్థానం

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. పీఎంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉంది. 74,199 ఇళ్లకుగానూ 64,928 నిర్మాణాలను పూర్తి చేసి 88 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఉగాది నాటికి 8,855 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం చేసుకోగా.. ఇప్పటికే 8,481 ఇళ్లు పూర్తయ్యాయి.
News March 13, 2026
పూతలపట్టు: పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయిన దొంగ

పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్లో ఓ బైక్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. రంగంపేట క్రాస్కు చెందిన హరిబాబు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను ఓ వ్యక్తి దొంగతనం చేసి తీసుకెళ్లాడు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. పెట్రోల్ అయిపోవడంతో ఆ దొంగ బైక్ను తోసుకుంటూ పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నట్లు తెలిసింది. వెంటనే స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.


